Jan 29,2023 23:52

సంతకాలు సేకరిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ నాయకులు

ప్రజాశక్తి-మాధవధార : స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం మాధవధార ప్రాంతంలో సిఐటియు నాయకులు కూన వెంకట్రావు ఆధ్వర్యాన సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాభాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వల్ల ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ప్రయివేటుపరం అయితే వారంతా రోడ్డున పడతారని తెలిపారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో మాధవధారలో ఉంటున్న స్టీల్‌ప్లాంట్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.