Jan 23,2023 23:13

పెందుర్తి సంఘీభావ దీక్షలో సిపిఐ, సిపిఎం, టిడిపి నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే తరిమికొడదామని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఈ నెల 30న చేపట్టే ఉక్కు ప్రజా గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన సోమవారం పలు కార్యక్రమాలు చేపట్టారు.
పెందుర్తి : పెందుర్తి కూడలిలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆధ్వర్యాన సంఘీభావ దీక్ష చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన దీక్షలో టిడిపి, సిపిఎం, సిపిఐ ఎంఎల్‌ (ఎన్‌డి), కాంగ్రెస్‌ తదితర పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, సిపిఎం పెందుర్తి జోన్‌ కార్యదర్శి బి.రమణి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, సిపిఐ ఎం ఎల్‌ ఎన్‌ డి నాయకులు కె నిర్మల తదితరులు మాట్లాడారు. ఈ దీక్షలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్‌కె రెహమాన్‌, కె.సత్యనారాయణ, వై.రాంబాబు, ఆసిరినాయుడు, సిపిఎం నాయకులు సూర్య ప్రకాష్‌, సిపిఐ ఎం ఎల్‌ ఎన్‌ డి నాయకులు యు.ఇందిర, వెంకటలక్ష్మి, రూప, జీవీఎంసీ టీడీపీ ప్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ బల్ల శ్రీనివాసరావు, నాయకులు రెడ్డి నారాయణరావు, వేగి పరమేశ్వరరావు, యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి షేక్‌ షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : ఉక్కు పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సిపిఐ నాయకులు అభిప్రాయపడ్డారు. సిపిఐ చిన గంట్యాడ శాఖా సమావేశం సోమవారం చైతన్య నగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎజె.స్టాలిన్‌ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపద అని, దీనిన అమ్మే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని పేర్కొనానరు. ప్రాణత్యాగాలతో ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని నరేంద్రమోడీ కార్పొరేట్లకు కట్టబెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.ఆనంద్‌, కసిరెడ్డి సత్యనారాయణ, అప్పారి విష్ణుమూర్తి, ఎ.దానయ్య, కెవి.కుమారి, పద్మ, అప్పారి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చోడవరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ ఈ నెల 30న మహాగర్జన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఒక్కటే పోరాటం చేస్తే తప్పకుంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.