ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని మాధవరం గ్రామ శివారులో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని లేబర్ డిప్యూటీ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. గురువారం ఆయన తహశీల్దార్ చంద్రశేఖర్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. మారుతి ఇస్పాట్ అండ్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ మాధవరం స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగులు, కార్మికులపై హింసలకు పాల్పడుతున్నారని, చుట్టుపక్కల గ్రామాల రైతుల పంటలకు నష్టం కలిగిస్తున్నారని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు ఈనెల 13న కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆరా తీసేందుకు జిల్లా లేబర్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఇబ్బందులకు గురవుతున్న కార్మికులకు అండగా ఉంటామని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్ మాదిగ తెలిపారు. తాలూకా ఇన్ఛార్జీ దేవపుత్ర మాదిగ, ఎమ్మిగనూరు ప్రధాన కార్యదర్శి సుమాల చార్లెస్ మాదిగ, నవ్యాంధ్ర బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు మోతే రామరాజు, బాధితులు, కంపెనీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తనిఖీలు చేపడుతున్న అధికారులు