Feb 20,2023 23:15

స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తున్న ఎంపిపి రాంబాబు

ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని అనంతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విద్యాకమిటీ సహయంతో స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి ఎంపిపి కె.రాంబాబు హాజరై విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యంశాన్ని విద్యార్థులు శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జి.లక్ష్మి, హెచ్‌ఎం కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.