Sep 02,2023 22:13

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
    మండల పంచాయతీ సర్పంచి ఛాంబర్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచిలు అందరూ పాల్గొని మండల సర్పంచిల ఛాంబర్‌ అధ్యక్షులుగా బన్నే బుచ్చిరాజు, ఉపాధ్యక్షులుగా మాల్చి వెంకన్న బాబు రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.