Oct 26,2023 20:02

పూజలు నిర్వహిస్తున్న సీతారామిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని టిటిడి పాలక మండలి సభ్యులు వై.సీతారామిరెడ్డి గురువారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు శ్రీమఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. ఆయనకు ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు భద్రత కల్పించారు. వైసిపి నాయకులు శివకుమార్‌, వడ్డే చిన్న ఈరన్న, ప్రాణేష్‌, సున్నం రామయ్య ఉన్నారు.