
శ్రీ చైతన్యలో ఘనంగా మాతృభాష దినోత్సవం
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య పాఠశాలల ఎజిఎం సురేష్, ఆర్ఐ రామాంజనేయులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ ఉగ్గుపాల నుండి మనం నేర్చుకునే మాతృభాషను సులభంగా మాట్లాడగలుగుతున్నామని, వినగలుగుతున్నామని, కానీ తప్పులు లేకుండా రాయలేకపోతున్నామని అన్నారు. కావున మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి తెలుగు భాషను గౌరవించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు పద్యాలు, పాటలు, నృత్యాలతో తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. అనంతరం విద్యార్థులు తెలుగుతల్లి, భరతమాత, వివిధ కవుల వేషధారణలతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో డీన్ రాజేష్, ఎఒ పరమేశ్వర రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.