అర్జీలు స్వీకరిస్తున్న కమీషనర్ మనోహర్
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 9 అర్జీలు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలోని సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన, డయల్ యువరు కమిషనర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










