
ప్రజాశక్తి -గాజువాక : స్నేక్ సేవర్ సొసైటీ వెబ్సైట్ను మింది గ్రామంలోని మంత్రి నివాసంలో గుడివాడ అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. స్నేక్ సేవర్ సొసైటీని స్థాపించి వన్యప్రాణుల సంరక్షణ, విష సర్పాల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం రొక్కం కిరణ్కుమార్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఇళ్లల్లోకి, పరిశ్రమల్లోకి చొరబడే సర్పాల నుంచి అక్కడి వారిని కాపాడుతూ పట్టుబడిన సర్పాలను కొండిపాంతాల్లో విడిచిపెట్టడం సాహసోపేత చర్య అని పేర్కొన్నారు. ఆపద అని తెలిసిన మరుక్షణమే సొసైటీ సభ్యులు అక్కడికి వెళ్లి ఎలాంటి సర్పాన్నైనా ధైర్యంగా పట్టుకొని ప్రజల్లో గుండె ధైర్యాన్ని నింపుతున్నారని కొనియాడారు. ఇలాంటి సాహసోపేత పనులు చేపట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా షషష.రఅaసవఝఙవతీసఱతీaఅ.షశీఎ పేరిట వెబ్ సైట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 68వ వార్డు వైసిపి నాయకుడు గుడివాడ లతీష్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.