ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
సంక్షేమం, అభివృద్ధే జగనన్న లక్ష్యమని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని 1వ వార్డు (1వ సచివాలయం) తేరుబజార్ నుంచి 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. వార్డు పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి మూడేళ్లలో లబ్ధిదారులు పొందిన సంక్షేమ పథకాలను గణంకాలతో సహా వివరించి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలకతీతంగా ఒక్క పైసా అవినీతి లేకుండా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తుండటం హర్షణీయమని తెలిపారు. వార్డులోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా ఐఎబి స్కీం కింద రూ.142 కోట్లతో జిడిపి నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు నిర్మాణ పనులను వేగవంతమయ్యేలా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్.రఘు, వైస్ ఛైర్మన్ డి.నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ, వార్డు కౌన్సిలర్ నాగేషప్ప, మున్సిపల్ డిఇ మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ యుకె.రాజశేఖర్, కో ఆపరేటివ్ స్టోర్ ఛైర్మన్ షబ్బీర్ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న జగన్మోహన్ రెడ్డి