Nov 21,2023 19:35

  ఏలూరు టౌన్‌: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎంఎల్‌ఎ ఆళ్ళనాని అధికారులను ఆదేశించారు. స్థానిక 12వ డివిజన్‌లో ఇటీవల నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారానికి చేపట్టిన చర్యలపై ఆయన అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధిలైట్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక కారణాలతో పథకాలు అందని వారికి సంబంధిత సమస్యలు సరిచేసి పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా 12వ డివిజన్‌ పరిధిలో సుమారు రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వెంకటకృష్ణ, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్‌ బాబు, కార్పొరేటర్‌ కర్రి శ్రీనివాస్‌, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.