Nov 20,2023 23:12

ప్రజాశక్తి-ఏలేశ్వరం తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ప్రత్తిపాడు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్‌ రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు ప్రత్తిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, లారీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు భూసాల శ్రీనివాస్‌ ప్రారంభించారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడి లక్ష్మి, కాకరపల్లి సునీత, కానూరి హేమలత, తిబిరిశెట్టి నాగసత్యవతి, ఉప్పాటి మరియా, నర్సే పద్మశ్రీ, ఎన్‌.అమరావతి, జె.రాణి, ఎం.నాగలక్ష్మి, పి.గంగభవాని, పి.నూకరత్నం ఉన్నారు.