వినతి పత్రాలు స్వీకరిస్తున్న సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రజాశక్తి - ఆదోని
స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్పందనలో డివిజన్లోని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు డివిజన్ స్థాయి వరకు రాకుండా చూసుకోవాలని తెలిపారు. గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు. పరిపాలన అధికారి గోవింద్ సింగ్, సీనియర్ సహాయకులు రామయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డిఎల్డిఒ నాగేశ్వరరావు, ఆర్టిసి డిపో మేనేజర్ మహ్మద్ రఫీ, ఆర్డబ్ల్యుఎస్ ఎఇ చేతన్ ప్రియ, డిప్యూటీ తహశీల్దార్ వలిబాష పాల్గొన్నారు.