Nov 11,2023 19:21

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ఎనిమిదేళ్లుగా ఉన్న సమస్యకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పరిష్కారం చూపారని కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను వైసిపి నాయకులు జనార్ధన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపిడిఒ కార్యాలయం సమీపంలో ఉన్న కాలనీలో లోవోల్టేజీ సమస్యతో 8 ఏళ్లుగా ఇబ్బందులు పడుతుండేవారని తెలిపారు. లోవోల్టేజీ సమస్య కారణంగా మోటార్లు, మిక్సీలు, టివిలు కాలిపోయేవని చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను పరిష్కరించాలని విద్యుత్‌ ఎఇ గోవిందును ఆదేశించారని తెలిపారు. పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జనార్ధన్‌ రెడ్డి చేతుల మీదుగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. విద్యుత్‌ సమస్యకు పరిష్కారం చూపిన అక్కడే నివాసం ఉంటున్న జనార్ధన్‌ రెడ్డి, కాలనీ వాసులు ఎమ్మెల్యేకు, విద్యుత్‌ శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.