ప్రజాశక్తి-ఆలూరు
సిసి రోడ్డు వేసిన తర్వాతే గ్రామంలోకి అడుగు పెడతానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. సోమవారం మండలంలోని పెద్దహోతూరు గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. గ్రామంలోని బోయ వీధికి చెందిన మహిళ మాట్లాడుతూ... వర్షాలు వచ్చినప్పుడు బురదలో పిల్లలు, వృద్ధులు కింద పడి లేచిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. తమ వీధికి ముందు రోడ్డు వేయించాలని మంత్రిని కోరారు. గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల నిధులు వచ్చాయని, వచ్చే నెలలో రోడ్డు వేసిన తర్వాతే గ్రామంలోకి అడుగు పెడతానని మంత్రి గుమ్మనూరు తెలిపారు. విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడం లేదని, రేషన్ కార్డులు, ఫించన్ను తొలగించారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను మంత్రి ఆదేశించారు. అంతకుముందు నూతన సచివాలయాన్ని ప్రారంభించి సచివాలయ ఉద్యోగులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సోదరుడు నారాయణ స్వామి, జడ్పిటిసి ఏరూరు శేఖర్, లింగన్న, మాజీ జడ్పిటిసి రామ్ భీం నాయుడు, సర్పంచి లక్ష్మన్న, ఎంపిటిసి ధనుంజయ, మండల కన్వీనర్లు వీరేష్, భూపాల్ చౌదరి పాల్గొన్నారు.
6వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలి : సిపిఎం
గ్రామంలోని 6వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం వార్డు సభ్యులు మైనా, స్థానికులు మంత్రిని కోరారు. మండలంలోని పెద్దహోతూరు గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 6వ వార్డులో సి సి రోడ్డు నిర్మాణం చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వార్డులో వాల్మీకులు, దూదేకులు, ముస్లింలు, నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు దాదాపు 300 మంది జనాభా నివాసిస్తున్నారని తెలిపారు. వీధుల్లో ఇప్పటివరకు సిసి రోడ్డు, డ్రెయినేజీ లేకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా వీధుల్లో నడవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. వార్డు ప్రజలు కూమార్, చంద్ర, సలువప్ప, దస్తగిరి పాల్గొన్నారు.
కౌతాళం : మండలంలోని చిరుత పల్లి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొని ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి రాష్ట్ర యువ నాయకులు వై.ప్రదీప్రెడ్డి, వైసిపి మండల నాయకులు అత్రి గౌడ్, ఎంపిపి అమ్రేష్, చెన్నప్ప, బసవ ప్రభు పాల్గొన్నారు. ఆదోని పట్టణంలోని సున్నం బట్టి, బండి మిట్ట ప్రాంతంలో 'గడపగడపకు మన ప్రభుత్వం'లో ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి పర్యటించారు. సమస్యలను తెలుసుకుంటూ అర్హులైన వారికి పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ మధుసూదన్, వైసిపి పట్టణ అధ్యక్షులు దేవా, డైరెక్టర్లు మటన్ మస్తాన్, మంజుల, ఎఇ నాగభూషణం, వైస్ ఛైర్మన్ నరసింహులు, ఎంఎంజి.గౌస్, ధర్మన్న, శ్రీలక్ష్, జిలేఖాబీ, చలపతి, మధు, మధుసూదన్ శర్మ, కామాక్షి తిమ్మప్ప, కిట్టు, రహీం, బాలాజీ, నాగరాజు, చిన్న ఈరన్న పాల్గొన్నారు.
రోడ్డు వేయాలని అడుగుతున్న మహిళ