
శిల్పారామంలో నృత్య ప్రదర్శనలిస్తున్న చిన్నారులు
ప్రజాశక్తి -పిఎం పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో సిద్ధేంద్రయోగి నాట్యాలయం ఆధ్వర్యాన శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాధ నమామ్యహం, బ్రహ్మంజలి, ఝానుత, శబ్ధం, భావములోన బాహ్యమునందున, రాజం కొండ మీద, ఘల్లు ఘల్లు, దానగూడ లంబాడి పిల్లా, మొక్క జొన్న తోటలో, నోమి నోమన్నలారా, తదితర అంశాలను ప్రదర్శించారు. పల్లవి, రాఘవ, ఈశ, స్రవంతి, వేదిత, యశస్వని, కణిత, మోక్ష, భాషిత కళాకారులు నృత్యాలను ప్రదర్శించి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారని శిల్పారామం పరిపాలనాధికారి టి.విశ్వనాథ్రెడ్డి తెలిపారు.