Oct 29,2023 00:31

పంటలు పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సాంప్రదాయ పంటలతో అధిక దిగుబడులు సాధ్యమని శాస్త్రవేత్తలు రాజుకుమార్‌, ఉజ్వలరాణి, జగన్నాథం అన్నారు. కొర్రాయి పంచాయతీ కరబలి గ్రామంలో సంజీవిని, రైతు సాధికార సంస్థ, వాసన్‌ సంస్థ, కొండెంపూడి ఏరువాక కేంద్రం ఆధ్వర్యాన చైతన్య సమావేశంతో పాటు గులిసామ, గులిరాగి పంటకోత ప్రయోగం శనివారం జరిగింది. పాత విత్తనాలతో సంప్రదాయ బద్దంగా సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు. సేంద్రియ పద్ధతి సాగుతో దిగుబడులు సాధ్యపడతాయన్నారు. ఎస్‌ఆర్పీ దేవుళ్లు, రైతు సాధికార సంస్థ డీపీఎం భాస్కరరావు, వ్యసాయశాఖ అధికారులు నీలవేణి, సవన్‌కుమార్‌, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, గిరిజన రైతులు ఉన్నారు.