ప్రజాశక్తి - మంత్రాలయం
సౌత్ జోన్లో జరిగిన కర్ర సాములో తన నైపుణ్యాన్ని, నేర్పును తనదైన శైలిలో కనపరచి మొదట స్థానంలో నిలిచి దళిత జాతికే వన్నె తెచ్చిన చిక్కం రమేష్ శభాష్ అంటూ జైభీమ్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ప్రశంసించారు. శనివారం మండలంలోని వి.తిమ్మాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చిక్కం ఆనంద్ రాజు పెద్ద కుమారుడు చిక్కం రమేష్ విజయవాడలోని ఎఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ కర్రసాములో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్లో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. రమేష్కు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జైభీమ్ ఎంఆర్పిఎస్ వి.తిమ్మాపురం నాయకులు మామిడి నాగేష్, చిక్కం బుజ్జయ్య, రామచిలకల జగన్, చిక్కం రోగన్న, చిక్కం ఆశీర్వాదం, రామచిలకల విజరు కుమార్, రామచిలుకల సుందర్ రాజ్, చిక్కం సదా, మామిడి వినోద్, రామచిలకల సంజీవ్, చిక్కం రాజు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న జానయ్య