న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో గురువారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల లేవెనెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆయనకు రాతపూర్వక సమాధానమిచ్చారు. మండలి రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి రద్దుపై టిడిపి ససేమిరా అంటే.. వైఎస్సార్సిపి పట్టుబట్టి... యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా తలపడ్డాయి. చివరికి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ.. వైఎస్సార్సిపి శాసనమండలి రద్దుపై తీర్మానం చేసి.. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే.