Oct 11,2023 23:35

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని జల వనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చాగల్లులో మంగళవారం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి వచ్చిన మంత్రిని రైతులు కలిసి సాగునీరు ఇవ్వాలని కోరారు. మంత్రి స్పందిస్తూ సాగర్‌లో ఆశించిన మేర నీటి నిల్వలు లేవన్నారు. ప్రస్తుతం సాగర్‌ కాల్వకు విడుదల చేస్తున్న 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకే వాడుకోవాలని చెప్పా రు. ఈ ఏడాది వర్షాధారమే తప్ప సాగర్‌ కాల్వల కింద పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదన్నారు. నీరు మనం సృష్టించేది కాదని, దొరికితే కొనుక్కొచ్చి ఇవ్వటం సులువు కాదని మంత్రి వ్యాఖ్యానించారు.