
ముంబయి : ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. శక్తికాంతదాస్ మాట్లాడుతూ... ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటున్నట్లు ఆర్బిఐ అంచనా వేస్తోందని, ఆర్బిఐ రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తుందని తెలిపారు. జూన్లో ద్రవ్య విధాన కమిటీ అంచనాల ప్రకారం... ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, కరోనా సెకండ్ వేవ్ ఎదురుదెబ్బ నుండి కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.