Feb 11,2023 23:31

ఎన్నికైన అధ్యక్షులు జగన్మోహనరావు, కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-సీతమ్మధార : ఏపీ రోడ్లు, బిల్డర్ల ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ విశాఖ జిల్లా కార్యవర్గాన్ని సీతమ్మధారలోని రోడ్లు భవనాల కార్యాలయంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సిహెచ్‌.జగన్మోహనరావు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎంఎ ఖాదర్‌, హానరబుల్‌ ప్రెసిడెంట్‌గా సుబ్రహ్మణ్యం, వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎం.అర్చన, సెక్రెటరీగా ఆర్డర్‌ అప్పారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పివిటిఎస్‌.ప్రసాదరావు, జాయింట్‌ సెక్రటరీగా కృష్ణకుమారి, ట్రెజరర్‌గా వెంకట తేజ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ పాపారావు తెలిపారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన అసోసియేషన్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నడుచుకోవాలని, అసోసియేషన్‌కు మంచి పేరు తెచ్చే విధంగా కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఎంవి.రానాప్రతాప్‌ ట్రెజరర్‌ సిహెచ్‌.లకీëనర్సుల తదితరులు పాల్గొన్నారు.