
ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని కోట్నపల్లి గ్రామ సమీపం బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢ కొన్నాయి. స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం... మండలంలోని దుర్గం పంచాయతీ పాలమామిడి గ్రామానికి చెందిన తమర్ల వెంకటరావు, సత్యనారాయణలు ద్విచక్ర వాహనం పై హుకుంపేట వస్తున్నారు. కొట్నాపల్లి బ్రిడ్జి సమీపంలో రెండు బైకులు ఢకొీన్నాయి. పాలమామిడి గ్రామానికి చెందిన తమర్ల వెంకటరావు, సత్యనారాయణలకు గాయాల య్యాయి.ఆటోలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పెదబయలు రూరల్,పాడేరు: పాడేరు మండలంలోని గుత్తులపుట్టు గ్రామంలో గురువారం జరిగే వారపు సంతకు వివిధ గ్రామాల నుండి వస్తున్న గిరిజనులు ప్రయాణిస్తున్న ఒక జీపు బోల్తా పడింది. పెదబయలు మండలం పరిధిలోని కిముడుపల్లి ఘాట్లో వస్తుండగా జీపు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. లోయలో పడిన జీపు పల్టీలు కొట్టడంతో ఇందులో ప్రయాణిస్తున్న ఆడ మగ కలిపి 20 మంది గిరిజనులు చెల్లాచెదురుగా పడిపోయారు. క్షత గాత్రులను 108 ద్వారా పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతున్న క్రమంలో పాంగి రాజారావు మృతి చెందారు. క్షతగాత్రుల్లో మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జీపు ప్రమాదంలో గాయపడిన గిరిజనులంతా పెదబయలు మండలం పులిగొంది గ్రామానికి చెందినవారు.మరో 10 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తీవ్ర గాయాలతో ఉన్న క్షత గాత్రులను కూడా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.