
ప్రజాశక్తి-యంత్రాంగం
తగరపువలస : రెండో వార్డు పరిధి సత్యనారాయణపేట కొండవాలు ప్రాంతంలో జివిఎంసి నిధులు రూ.74 లక్షలతో నిర్మించ తలపెట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, వివిధ శాఖల అధికారులు, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.
పార్కులో వ్యాయామ పరికరాలు
పిఎం పాలెం : జివిఎంసి ఆరో వార్డు పరిధి పిఎం.పాలెం సమీపంలో ఉన్న హెచ్పిసిఎల్ లే-అవుట్ రోడ్డు పార్కులో ఏర్పాటుచేసిన వ్యాయామ పరికరాలను భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆనంతరం కమ్యూనిటీహాల్లో సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు, కన్వీనర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, 38 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అవినీతి రహిత పాలనను వైసిపి ప్రభుత్వం అందిస్తుందన్నారు. వాలంటీర్ల సేవలను ప్రశంసించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వాలంటీర్లు, కన్వీనర్లు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోన్ టు కమిషనర్ కె కనకమహాలక్ష్మి, 8వ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు, 5, 6, 7 వార్డుల వైసిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాస్, బొట్ట అప్పలరాజు, పోతిన హనుమంతు, గాదె రోశి రెడ్డి, పోతిన యల్లాజి, పోతిన ప్రసాద్, పిల్లా రమణబాబు, గుంటుబోయిన సంజీవ్, పోతిన మూర్తిబాబు, పిల్లా సూరిబాబు, రయిన సాయి, జగుపిళ్లి నరేష్, కొండపల్లి వరలక్ష్మి, మోజ్జడ రమణమూర్తి, కుడితి రామారావు పాల్గొన్నారు.