ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయని, ఈ గాలులు వర్షాలపై పెద్దగా ప్రభావం చూపవని అమరావతి వాతావరణ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.