
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.