Oct 29,2023 00:12

ఫిర్యాదు చేయడానికి సచివాలయానికి వచ్చిన బాధిత వినియోగదారులు

ప్రజాశక్తి -సీలేరు
ఎమ్‌డియు ద్వారా రేషన్‌ సరుకులు సక్రమంగా అందజేయకపోవడంతో స్థానిక దుర్గవీధికి చెందిన వినియోగదారులు సీలేరు సచివాలయ వీఆర్వో సత్యనారాయణ, ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, సర్పంచ్‌ దుర్జు, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ దుర్జు మాట్లాడుతూ జీకే వీధి మండలం సీలేరు జిసిసి డిపో పరిధిలో ఎనిమిది వందలకు పైగా తెల్ల కార్డులు కలిగిన వినియోగదారులు ఉన్నారని, వారికి బియ్యం అరకొరగానే ఎండియు ప్రసాద్‌ అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇంటింటికి రేషన్‌ సరుకులు ఇవ్వవలసి ఉండగా, అందుకు భిన్నంగా కొద్దిరోజులు జిసిసి డిపోలోనూ, మరికొన్ని రోజులు ఇంటింటికి వాహనం ద్వారా సరఫరా చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఎండియు ప్రసాద్‌పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు పంచాయతీ పాలకవర్గం ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, గుమస్తా ప్రకాష్‌, ఉప సర్పంచ్‌ కే.వల్లి ప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకులు కె. శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కుసుమ, మహిళా పోలీస్‌ రేవతి వాలంటీర్లు దుర్గ పాల్గొన్నారు.