Nov 21,2023 19:28

  ముసునూరు: విజయవాడలోని ఐజిఎంసి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి త్రోబాల్‌ క్రీడా విభాగంలో ముసునూరు హైస్కూల్‌ నుంచి పి.ఐశ్వర్య అండర్‌-14 విభాగంలో, ఎం.సంతోష్‌ కుమార్‌ అండర్‌-17 విభాగంలో రాష్ట్రస్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం ఎ.సునీల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను అందరూ కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యువరాజ్‌, నాగేశ్వరావు, ఫ్రాన్సిస్‌, నాగమల్లేశ్వరి, వాణికుమారి, బి.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.