Nov 30,2022 23:45

పతకాలు సాధించిన విద్యార్థులు

ప్రజాశక్తి- చోడవరం
నంద్యాలతో నబంబర్‌ 25 నుండి 28వ తేదీ వరకు జరిగిన 2వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి 18 బంగారు, 16 రజత, 12 కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతకాలు : చోడవరంకు చెందిన బొబ్బిలి రామచంద్ర (2 బంగారు పతకాలు), ఎం.సంతోషి లక్మి, వి.లికిత, కోల్లిపార తన్విత్‌, జి.కారున్యదీప్‌, అనకాపల్లికి చెందిన ఎం.పూజిత (2), డి.జహ్నవి (2), ఎం.మోహన్‌ (2), ఎం.పవిత్ర, ఎ.సహస్ర, బి.లోకేష్‌, కె.దీపశ్రీ, డి.కృష్ణవేణి, కె.చంటిబాబు. రజత పతకాలు : చోడవరంకు చెందిన ఎం.సంతోషి లక్మి, వి.లికిత, ఎం.హేమశ్రీ, వి.ఇసిత శరద (కిడ్స్‌), విష్ణువర్థన్‌, జి.నాగ సాయిరామ్‌, పిఎస్‌ఎస్‌.తరుణ్‌ (2), ఎస్‌.తనహా (2), కె.రోహిత్‌, వి.జసిక రోజిలి రజతం, అనకాపల్లికి చెందిన డిఎస్‌ఎస్‌.అంజని ప్రియ, బి.దినేష్‌, డిఎల్‌జి.మణిలర్‌, పెదపాటి హర్షవర్థన్‌ సూర్య, కె.దిపశ్రీ, ఆర్‌ లోకేష్‌ కాంస్య పతకాలు : చోడవరంకు చెందిన ఆర్‌.దిక్షిత, శశివర్థన్‌, వి.సాయి దశ్వంత్‌, అనకాపల్లికి చెందిన బి.దినేష్‌, కె.కార్తీక, ఎస్‌కె.దహిద అంజుమ్‌, ఎ.చార్విక్‌, ఆర్‌.లోకేష్‌ పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్‌లు దూలం రమేష్‌, సంతోషి లక్మి, శేఖర్‌ను ఎపి తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షులు టి.హర్షవర్థన్‌ ప్రసాద్‌ అభినందించినట్లు ఉమ్మడి జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు పల్లం మురళీకృష్ణ తెలిపారు.