Aug 01,2021 07:20

1981ఆగస్టు1న ప్రజాశక్తి దినపత్రికగా అవతరించి ప్రతి అక్షరం ప్రజల పక్షం వహిస్తూ దిన దిన ప్రవర్థమానం చెందుతున్నది. తెలుగు ప్రజలు ఎదుర్కొన్న అనేక రాజకీయ తుపానుల్లో సైతం అకుంఠిత దీక్షతో నిలిచి బడుగు వర్గాల ప్రజల ఆశాజ్యోతిగా పత్రికా ప్రపంచంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రజా ఉద్యమాలకు చుక్కానిగా, మహనీయుడు సుందరయ్య కలల పంటగా ప్రజాశక్తి నిలిచింది. శ్రమ జీవుల సౌభాగ్యానికి మార్గదర్శి అయి, ఆకలి, అవిద్య లేని సమసమాజ నిర్మాణం కోసం వెలుగు దివ్వెగా నిలుస్తోంది. ప్రజాశక్తి భవిష్యత్తులో మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని, అవినీతి, అరాచక శక్తుల పాలిట సింహ స్వప్నంగా నిలవాలని ఆశిస్తూ...

                                                                                                            మీ సోదరి

                                                                                                            పి. వసంత