Aug 09,2021 12:50

గుంటూరు : పులిచింతల ప్రాజెక్టును సందర్శించేందుకు టిడిపి నేత జివి ఆంజనేయులు ఆధ్వర్యంలో టిడిపి నేతల బృందం సోమవారం పులిచింతలకు వెళ్లింది. మాదిపాడు వద్ద టిడిపి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెప్పడంతో... పోలీసుల తీరును నిరసిస్తూ టిడిపి నేతలు ఆందోళనకు దిగారు.