ప్రతిజ్ఞ చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది
ప్రజాశక్తి - పెదబయలు :స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం అటవీ శాఖ రేంజ్ కార్యాలయం నుండి పర్యావరణంపై అవగాహనా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటా మొక్కలు నాటాలని, చెట్లను పెంచాలని, ప్లాస్టిక్ వాడకం నిరోదించాలని నినాదాలు చేసారు ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










