Apr 23,2023 21:46

పరీక్షలను తనిఖీ చేస్తున్న ప్రిన్సిపాల్‌, ఎంఇఒ, అబ్జర్వర్‌

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
ప్రజాశకి - పగిడ్యాల

      మండలంలోని లక్ష్మాపురం అంచ సమీపాణ ఉన్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్‌మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా ఎంఇఒ సుభాన్‌, ప్రిన్సిపాల్‌ వెంకటరమణమ్మలు పరీక్షలను తనిఖీ చేసి మాట్లాడారు. గురుకులంలో ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్‌ మొదటి సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5వ తరగతి 675 మంది విద్యార్థులకుగాను 146 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, ఇంటర్‌ మొదటి సంవత్సరం 313 మంది విద్యార్థులకు గాను 54 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు.