Nov 15,2023 23:23

ప్రజాశక్తి-చల్లపల్లి : విజయవాడలో జరిగిన ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు చల్లపల్లి మండలం నుండి భారీగా సిపిఎం పార్టీ బందంతరలి వెళ్లారు. పార్టీ సభ్యులు కార్యకర్తలు అంగన్వాడి, పంచాయతీ కార్మికులు ఆటో వర్కర్స్‌, కళాకారులు సభకు తరలి వెళ్లారు. గత వారం రోజులుగా సిపిఎం సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో పర్యటించి సమావేశాలు, కరపత్రాల పంపిణీ చేశారు, బైక్‌ ర్యాలీ ఆటో జాత నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. చల్లపల్లి మండలం సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ గంగాభవాని, మహమ్మద్‌ కరిముల్లా, మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బండారు కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు తరళివెళ్లారు. విజయవాడ సభకు తరలివచ్చిన కార్యకర్తలకు నాయకులకు మండల కమ్యూనిస్టు పార్టీ తరఫున కార్యదర్శి యద్దనపూడి మధు అభినందనలు తెలిపారు. ప్రజాశక్తి ఘంటసాల : ఘంటసాల నుంచి ప్రజారక్షణభేరి కి సిపిఎం సీనియర్‌ నాయకులు వాకా రామచంద్రరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బుధవారం తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.