
కేలండర్ను ఆవిష్కరిస్తున్న మణిరామ్ తదితరులు
ప్రజాశక్తి-విశాఖపట్నం : ప్రజానాట్యమండలి రాష్ట్ర కేంద్రం రూపొందించిన నూతన సంవత్సర కేలండర్ను విశాఖపట్నం జిల్లా డిపిఆర్ఒ డీడీ మణిరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిరామ్ మాట్లాడుతూ, ప్రజానాట్యమండలి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎం.చంటి, జిల్లా అధ్యక్షులు జి.రమణ, జిల్లా గౌరవాధ్యక్షులు దండు నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు అరుణ్జి, పోర్టు విశ్రాంత ఉద్యోగి, సీనియర్ దర్శకులు బొట్ట వేణుగోపాలరావు పాల్గొన్నారు.