
ప్రజాశక్తి -యంత్రాంగం
పిఎం పాలెం : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. శిల్పారామంలో గురువారం గృహ సారధుల సమావేశం నిర్వహించారు. భీమిలి వైసిపి పర్యవేక్షకులు పసుపులేటి బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయాలకతీతంగా, అర్హత కలిగిన ఏ ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరగకూడదనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. అర్హత ఉండి సంక్షేమానికి నోచుకోని వారందరినీ గుర్తించేందుకు వాలంటీర్లతో పాటు గృహ సారథులను కొత్తగా నియమించినట్లు తెలిపారు. వాలంటీర్లతో కలిసి పనిచేసి అప్పగించిన గృహాల్లో ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో గుర్తించాలన్నారు. అనంతరం వాలంటీర్లకు, గృహ సారథులకు 'మా నమ్మకం నువ్వే జగనన్న' కిట్టు బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 5, 6, 7 వార్డుల వైసిపి అధ్యక్షులు పోతిన హనుమంతరావు, బొట్టా అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, నాయకులు ఇఎన్ఎస్ చంద్రరరావు పోతిన మూర్తిబాబు, పిల్లా రమణబాబు, పోతిన ప్రసాద్, పోతిన ఎల్లాజీ, వాండ్రాసి రవికుమార్, వాలంటీర్లు, గృహసారథులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు సూచించారు. గురువారం స్థానిక ఎఎంసి కార్యాలయ ప్రాంగణంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హతను ప్రాతిపదికగా తీసుకుని నవరత్నాలు అందిస్తున్నట్లు వివరించారు. నియోజక వర్గ పార్టీ పరిశీలకులు పి.బాలరాజు, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు
సీతమ్మధార : సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు ప్రభుత్వానికి మంచి పేరుతో తెచ్చేలా పనిచేయాలని ఉత్తర నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, మేయర్ హరి వెంకట్కుమారి సూచించారు. ఉత్తర నియోజకవర్గ పరిధి 26, 42, 43, 44వార్డులకు సంబంధించిన జెసిఎస్ గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లకు షాదీఖాన మండపంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతిశ్రీనివాస్, పి.ఉషశ్రీ, నాయకులు పీలా వెంకటలక్ష్మి, బులుసు జగదీష్, మహ్మద్ ఫరూకి, పేడాడ రమణికుమారి, తదితరులు పాల్గొన్నారు.