ప్రజాశక్తి-దేవరాపల్లి
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలో వైసిపి ప్రభుత్వం తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం దేవరాపల్లిలో నల్లజెండాలు చేతబట్టి నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటూ ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జి పివిజి కుమార్ మాట్లాడుతూ అటు లోకేష్ పాదయాత్రను, ఇటు చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. టిడిపి మండల అధ్యక్షులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో కాశీపురంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ సత్యవతి, టిడిపి నాయకులు పోతల పాత్రునాయుడు, కరుణాకర నాయుడు, కర్రి నాయుడు, డీడీ నాయుడు, గుల్లేపల్లి చిరంజీవి, చల్లా నానాజీ, బండారు రామారావు, చింతా సాంబమూర్తి, కిల్లి గోవిందు, బండారు అప్పలనాయుడు, దేముళ్లు, బుజ్జి, వాకపల్లి పాత్రుడు, బాబురావు, రాయపురెడ్డి ఈశ్వరరావు, పెంటయ్య, జగ్గారావు, శ్రీను, తమడాన ప్రసాద్, కడిమి నాగేశ్వరరావు, ప్రసాద్, మూత్యలరావు, సంజీవ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ షోను పోలీసులు అడుగడుగునా అడ్డుకుని, కార్యకర్తలపై దౌర్జన్యాన్ని నిరసిస్తూ శనివారం నక్కపల్లి లో తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేశ్ ఆద్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహాం వద్ద కళ్ళకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించి, రాజ్యాంగాన్ని కాలరాస్తున్న ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొప్పిశెట్టి బుజ్జి, గింజాల లక్ష్మణరావు, మీగడ సత్యనారాయణ, వైబోయిన రమణ, ప్రగడ వీరబాబు, అడ్డూరి లోవరాజు, శ్రీనివాసరావు, సింహాద్రి, సన్యాసిరావు, తాతారావు, ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, వీరబాబు, అప్పారావు, శ్రీనివాసరావు, సింహాద్రి, పెదకాపు, దివానం, గంగరాజు, రాము, బాబ్జి , నూకరాజు పాల్గొన్నారు.
యస్.రాయవరం : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అడ్డుకోవడంపై మండలంలోని పెదగుమ్ములూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నల్ల బ్యాడ్జిలతో ప్రభత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ యేజర్ల వినోద్ రాజు మాట్లాడుతూ,మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రజా సమస్యలపై పర్యటన చేస్తుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కి చెమటలు పడుతున్నాయని విమర్శించారు. ప్రజల్లో వస్తున్న ఆధరణకు భయపడి ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విధంగా గత టిడిపి ప్రభుత్వం ఆలోచించి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటించేవారా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అమలకంటి అబద్దం, గుర్రం రామకృష్ణ, కోన అప్పలరాజు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల : మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకు ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి జగన్కు చెమటలు పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమ ంలో బీసీ సెల్ అధ్యక్షులు వి.భాస్కరరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరావు, సుంకర బాబ్జి, కసిరెడ్డి యేసు, తంగేటి శ్రీను, లోవరాజు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.










