Nov 18,2023 23:03

ప్రజాశక్తి - మామిడికుదురు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు. నగరం హైస్కూల్లో గోరుముద్దలో భాగంగా మంజూరైన వంట పాత్రలను శనివారం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆయన అందజేశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జాలెం రమణకుమారి, జెడ్‌పిటిసి కె.అంజిబాబు, చిట్టూరి రామకృష్ణ, యువివి.సత్యనారాయణ, కుసుమ శ్రీధర్‌, హెచ్‌ఎం పి.విజయకుమారి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.