ప్రజాశక్తి - ఆదోని
ప్రజారోగ్యం దృష్ట్యా హోటళ్ల యజమానులు ఆహార విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు మెలగాలని విజిలెన్స్ ఎస్పీ పూజిత, సిఐ సునీల్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ సూచించారు. శుక్రవారం ఆదోనిలోని ద్వారక ఫంక్షన్ హాలులో అగ్రికల్చర్ ఫర్టిలైజర్, హోటల్ రంగానికి సంబంధించిన వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు వ్యాపారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యాపారం అనేది నేడు కొందరు లాభాపేక్షంగానే చూస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యతను పాటించాలని సూచించారు. నాణ్యత గల పంటలు పండాలంటే నాణ్యత గల ఎరువులు, మందులు రైతులకు అందించాలని తెలిపారు. ఆహారాల తయారీ విషయంలో వ్యాపారులు నిబంధనలు పాటించాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఫర్టిలైజర్ అగ్రి జిల్లా అధ్యక్షులు అశోక్ నంద్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ఆదోని గౌరవాధ్యక్షులు కెబి.రాజు స్వామి, కార్యదర్శి టి.వీరేష్, జె.ప్రవీణ్, ఎన్కె.సోమశేఖర్ ఉన్నారు.
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కమిషనర్