
కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి -సీలేరు : యుద్ధ పోరులో శత్రువులు చేతిలో అమరులైన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం జీకే వీధి మండలం సీలేరు మెయిన్ రోడ్డులో మంగళవారం స్థానిక ఎస్సై రామకృష్ణ, సిఆర్పిఎఫ్ జి42 బెటాలియన్ డిఎస్పి సురేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సురేష్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారం రోజులపాటు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే కొవ్వొత్తులు ప్రదర్శన చేసి వారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా మౌనం పాటించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని కాపాడే దిశగా పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, టిడిపి నాయకులు బోర్ర కృష్ణ, సిఆర్పిఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.