Nov 01,2023 20:29

ప్రజలకు వైసిపి వైఫల్యాలను వివరిస్తున్న తిక్కా రెడ్డి

ప్రజాశక్తి -పెద్దకడబూరు
రాష్ట్రంలో వర్షాలు కురవక, సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, పనుల్లేక రైతులు వలసలు వెళ్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైసిపి ప్రభుత్వాన్నిఇంటికి సాగనంపాలని ప్రజలను కోరారు. బుధవారం పెద్దకడబూరు మండలం తారాపురం, రంగాపురం, చిన్నకడబూరు గ్రామాల్లో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ' నిర్వహించారు. క్లస్టర్‌ ఇన్‌ఛార్జీ నరవ రమాకాంత్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీతారాపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలకు మంచి జరగాలంటే ఒక్క టిడిపితోనే సాధ్యమని తెలిపారు. రానున్న రోజుల్లో టిడిపిని ఆదరించాలని కోరారు. జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ బాధ్యులు లక్ష్మన్న, జనసేన కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న, ఆర్‌టిఎస్‌ కన్వీనర్‌ దశరథ రాముడు, బీసీ సాధికారిక రాష్ట్ర సభ్యులు కురువ మల్లికార్జున, మీసేవ ఆంజనేయులు, తలారి అంజి, భరత్‌ కుమార్‌ స్వామి, చిన్నతుంబలం వీరేష్‌ గౌడ్‌, శివ, బొగ్గుల నరసన్న, ప్రవీణ్‌, సుధా, చిన్నకడబూరు నరసన్న, రంగాపురం మహాదేవ, నల్లారెడ్డి, బసలదొడ్డి కృష్ణ, చిన్న పాల్గొన్నారు.