Nov 01,2023 20:42

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - నందవరం
మండలంలో అనావృష్టి వల్ల వర్షాల్లేక ఎండిన పత్తి పంటలను పరిశీలించి, రైతుల గోడును విని వైసిపి ప్రభుత్వం ప్రతి ఎకరాకూ నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని నాలుగు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బీవీ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా నందవరంలో టిడిపి యువ నాయకులు, దేశాయి నెట్‌వర్క్‌ అధినేత గురురాజ్‌ రావు దేశాయి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగునీరందించమంటే రైతులు దగ్గర రూ.వేలు డబ్బులు తీసుకోవడం సిగ్గుచేటని తెలిపారు. చంద్రబాబు వస్తే వర్షాలు రావన్న ముఖ్యమంత్రి జగన్‌, నేడు వర్షాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే బటన్‌ నొక్కి వర్షాలు తెప్పించాలని ఎద్దేవా చేశారు. నందవరం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ కార్యకర్త గడ్డం నాగన్న అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకొని స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఒక వైద్యునిగా ఆయనకు సూచనలు, సలహాలు అందించారు. మాచాపురం గ్రామంలో పర్యటించి టిడిపి కార్యకర్త హనుమంతు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందడంతో స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఇబ్రహీంపురం, కొట్టాల గ్రామాల్లో పర్యటించి 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ'లో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఈరన్న గౌడ్‌, నాగరాజు గౌడ్‌, కాసీం వలీ, గజేంద్ర రెడ్డి, రైస్‌ మిల్‌ నారాయణరెడ్డి, ధర్మపురం గోపాల్‌, చిన్న రాముడు, శంకరమ్మ, చంద్రశేఖర్‌ రెడ్డి, దావీదు, బాలరాజు, షరీఫ్‌, రామన్న గౌడ్‌, మస్తాన్‌, బోయ వీరేష్‌, ఐ టిడిపి వీరేష్‌, మిట్టా సోమాపురం వీరేష్‌, డబ్బా ఈరన్న, రాఘవ రెడ్డి, తులసి, సాధిక్‌, రాము పాల్గొన్నారు.