Jan 21,2023 23:23

సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి-యంత్రాంగం
సీతమ్మధార : జివిఎంసి 46వ వార్డు పరిధి మధుసూధననగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె రాజు, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక సచివాలయాల ద్వారా కొండవాలు, మురికివాడల ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యులు సేనాపతి అప్పారావు, 14వ వార్డు కార్పొరేటర్‌ కె.అనీల్‌కుమార్‌రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్‌రాజు, వార్డు అధ్యక్షులు పైడి రమణ, జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఆనందపురం : మండలంలోని మామిడిలోవ పంచాయతీలో శనివారం భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యాన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీలోని ప్రజల సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలచే కోలాటం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బంక సత్యనారాయణ, కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, కోరాడ వెంకటరావు, మజ్జి వెంకటరావు, బలిరెడ్డి మహేష్‌, రమేష్‌బాబు, పాండ్రంకి శ్రీను, కోరాడ ముసలినాయుడు, బొట్టా రామకృష్ణ పాల్గొన్నారు.