
ప్రజాశక్తి-యంత్రాంగం
ములగాడ : జివిఎంసి 60వ వార్డులో కొత్తగా మంజూరైన 180 పెన్షన్లను లబ్ధిదారులకు వార్డు కార్పొరేటర్ డాక్టర్ పివి.సురేష్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సురేష్ మాట్లాడుతూ, తన వార్డులో కొత్తగా 180 పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆనందపురం : వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా మంజూరైన 20 వృద్ధాప్య పింఛన్లను లబ్ధిదారులకు వైసిపి నాయకులు కాకర వెంకటరమణ మంగళవారం అందజేశారు. నూతనంగా పెంచిన రూ.2750 పెన్షన్లను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కె.చంద్రమౌళి, ఉప సర్పంచ్ కంచరాపు శ్రీనివాసరావు, వైసిపి నాయకులు పడాల రాము, తోణంగి అప్పారావురెడ్డి, చెన్నా సత్యం, బుల్లిరెడ్డి, ఎర్రంశెట్టి అప్పలరాజు, పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్మూర్తి, ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
గంభీరం పంచాయతీలో కొత్తగా మంజూరైన 19 పెన్షన్లను లబ్ధిదారులకు వైస్ ఎంపిపి బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వానపల్లి లక్ష్మి, ముత్యాలరావు, ఉప్పాడ సూరిబాబు, సచివాలయ కన్వీనర్లు ముసలయ్య, సత్యవేణి, రమణ, గోవింద్, సెక్రటరీ చలపతిరావు, డిజిటల్ అసిసంట్ దివ్య, నాయకులు నర్సింగరావు, పైడిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.