
ప్రజాశక్తి-యంత్రాంగం
వేపగుంట : జివిఎంసి 94వ వార్డు సచివాలయ పరిధిలో కొత్తగా మంజూరైన పింఛన్లతోపాటు వృద్ధులకు, వికలాంగుల పెన్షన్లను గురువారం 93వ వార్డు వైసిపి నాయకులు దాసరి రాజు, సచివాలయ అడ్మిన్ భారతి, వెల్ఫేర్ అధికారి లావణ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలా ఆదుకుంటున్న జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సంపత్, వినోద్, కిషోర్, జిలాని పాల్గొన్నారు.
ఆనందపురం : వేములవలస పంచాయతీలో నూతనంగా మంజూరైన 11 పింఛన్లను పంచాయతీ కార్యదర్శి పి.నరసింగరావు ఆధ్వర్యాన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు కోరాడ మంగలత, పతివాడ పుష్పలత, వైసిపి నాయకులు కోరాడ అప్పలస్వామి నాయుడు, సర్పంచ్ లంక కొండమ్మ , వెల్ఫేర్ అసిస్టెంట్ శివ తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : జీవీఎంసీ 14వ వార్డులో నూతనంగా మంజూరైన పింఛన్లను కార్పొరేటర్ అనీల్ కుమార్రాజు పంపిణీ చేశారు. వార్డుకు కొత్తగా 45 పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కోడూరు సత్యనారాయణ, వల్ల శ్రీనివాస్, రాజకుమారి, గురి నీలిమ, ప్రవీణ్వర్మ, అరుణ బోగలింగేశ్వరరావు, తులసీరాం పాల్గొన్నారు.