Nov 18,2023 18:39

ప్రజాశక్తి - ఆచంట
           పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని పెనుమంచిలి సర్పంచి గణేశుల శేషవాణి సుబ్బారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి కార్యక్ర మంలో భాగంగా శనివారం పెనుమంచిలి గ్రామంలో ప్రభు త్వ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. తొలుత గ్రామ సచివాలయ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్‌ డిజి టల్‌ బోర్డు ప్రారంభించి, జెండా ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రిగా జగన్మో హన్‌ రెడ్డి మంచి గుర్తింపు పొందారన్నారు. కుల, మత, రాజ కీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో వైసిపి మండలాధ్యక్షులు జక్కంశెట్టి చంటి, ఉప స ర్పంచి గంటి బాబూరావు, వైసిపి గ్రామ కన్వీనర్‌ నక్క ప్రేమ్‌ కుమార్‌, కమిటీ ఛైర్మన్‌ భీమారావు పాల్గొన్నారు.