జగనన్న సురక్షలో శివారెడ్డి గౌడ్, ఎంపిడిఒ
ప్రజాశక్తి - నందవరం
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని వైసిపి మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్, ఎంపిడిఒ దశరథ రామయ్య తెలిపారు. గురువారం నందవరంలో సచివాలయం-3లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. పేదలు ఖర్చు పెట్టుకోలేని రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. డాక్టర్లు సౌజన్య, పరిమళ, చంద్రకాంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.