
ప్రజాశక్తి -యంత్రాంగం
తగరపువలస : రోడ్డు ప్రమాదంలో కుడి కాలుకు తీవ్ర గాయాలైన భీమిలి మండలం, టి.నగరపాలెం గ్రామానికి చెందిన కుప్ప రమణ కుటుంబానికి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.55 వేలు ఆర్థిక సాయం అందజేశారు. నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వి.సతీష్, పి.రామారావు, రమేష్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధి కృష్ణాకాలనీలో నివాసముంటున్న పేద మహిళ ఎల్.సూర్యకాంతానికి స్థానిక టిడిపి నాయకులు జలగడుగుల మురళి సొంత నిధులతో సమకూర్చిన బియ్యం, పప్పులు, వంట నూనె తదితరాలను ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు కె.గురుమూర్తి, పి.రామారావు, ఆర్.రమణ, వియ్యపు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
జివిఎంసికి చెందిన క్లాప్ వాహనం ఢకొీని చిట్టివలస, కొత్తపేటకు చెందిన బవిరిశెట్టి రాంబాబు ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.