Oct 26,2023 20:05

గోడౌన్‌ను తనిఖీ చేస్తున్న ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పౌర సరఫరాల గోడౌన్‌ను ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ గురువారం తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న రేషన్‌ నిల్వ రికార్డ్స్‌, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మాట్లాడారు. బియ్యం కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. తహశీల్దార్‌ ఆంజనేయులు, డిప్యూటీ తహశీల్దార్‌ గురు రాజారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.