శంకుస్థాపన చేస్తున్న సర్పంచ్
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని లివిటిపుట్టు జిపిఎస్ పాఠశాలలో నూతన భవనం నిర్మాణానికి బుధవారం స్థానిక పోతంగి సర్పంచ్ వి.వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.జగ్గునాయుడు, వార్డు మెంబర్ కాంతారావు, ప్రధానోపాధ్యాయుడు ఎం.సుభాకర్, నాగేంద్ర, నాడు నేడు కమిటీ అధ్యక్షుడు గణేష్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










